ల్యాప్‌టాప్‌‌లో Jio 4G ఇంటర్నెట్‌ను వాడుకోవటం తెలుసా ..?


కొన్ని సులువైన పద్ధతుల ద్వారా మీ 4జీ ఇంటర్నెట్‌ను మీ వ్యక్తిగత కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌కు షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు  ఎలా కనెక్ట్ చేయాలో  చూద్దాం...

1.మీ పీసీ లేదా ల్యాప్‌టాప్ వై-ఫై కనెక్టువిటీ సామర్థ్యాలను కలిగి ఉన్నట్లయితే స్మార్ట్‌ఫోన్ ద్వారా హాట్‌స్పాట్‌ను క్రియేట్ చేసి ఫోన్ ఇంటర్నెట్‌ను పీసీలోకి షేర్ చేసుకోవచ్చు. చాలా వరకు డెస్క్‌టాప్ కంప్యూటర్లు వై-ఫైను సపోర్ట్ చేయవు. కాబట్టి ల్యాప్‌టాప్‌లలో మాత్రమే ఈ స్టెప్ వర్క్ అవుట్ అవుతుంది.

2.USB Tethering విధానం ద్వారా జియో 4జీ ఇంటర్నెట్‌ను మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో వాడుకోవచ్చు. USB Tethering ఆఫ్షన్ ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్బీ కేబుల్ ద్వారా పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

3.మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో USB Tethering ఆఫ్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే.? Settings > More > Tethering and portable hotspotsలోకి వెళ్లి USB Tethering ఆఫ్షన్ ను సెలక్ట్ చేసుకోండి.

4.యూఎస్బీ డాంగిల్ ఆధారంగా జియో 4జీ ఇంటర్నెట్‌ను మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో వాడుకోవచ్చు. ముందుగా మీ జియో సిమ్ కార్డ్‌ను డాంగిల్‌లో ఇన్సర్ట్ చేసి మీ కంప్యూటింగ్ డివైస్‌కు కనెక్ట్ చేయవల్సి ఉంటుంది.


5.మీరు వాడుతన్న డాంగిల్ ఖచ్చితంగా ఎయిర్‌టెల్ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసేదిగా ఉండాలి. ముందుగా సిమ్ కార్డ్‌ను ఆ డాంగిల్‌లో ఇన్సర్ట్ చేయండి. తదుపరి చర్యలో భాగంగా ఆ డాంగిల్‌ను పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి కనెక్షన్‌ను Establish చేస్తే చాలు.

No comments:

Post a Comment